Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 October 2022, 10:18 am Posted by : anjudega

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల వాసవి క్లబ్స్  ఆధ్వర్యంలో విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించి దాత మాదంశెట్టి రమాదేవి సత్యనారాయణ  సహకారంతో ప్రధమ, ద్వితీయ, తృతీయ తో పాటు 15 మందికి కన్సోలేషన్ బహుమతులను ఆడపడుచులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటకం హరీష్, ముక్త శ్రీనివాస్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ అక్కినపల్లి రవీందర్, జోన్ చైర్మన్, కాచం సతీష్, కొంకముట్టి వెంకటేశ్వర్లు, నాగిశెట్టి జ్యోతి, వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలమాసు ప్రవీణ్, కోశాధికారి మల్యాల శ్రీనివాస్, కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం రమేష్, సభ్యులు కాచం సతీష్ తో పాటు క్లబ్ నాయకులు పాల్గొన్నారు.