
ఆంజనేయులు న్యూస్: పరాయి ఎడారి దేశంలో కూడా హిందు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు వైభవోపేతంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి -TGWWC ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను గత సంవత్సరల లాగే నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య అన్నారు. వినాయక విగ్రహానికి ఐదు రోజలపాటు పూజలు చేసి ఆదివారం నాడు నిమజ్జనం చేయండం జరిగినది.
రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అయినా ఇప్పటికీ గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేలా మరియు పోరుగు రాష్ట్రాలైన పంజాబ్, బీహార్ వలస కార్మికులకు ఎక్స్గ్రేషియా చేయడం కాకుండా సొంత రాష్ట్ర గల్ఫ్ లో మరణించిన వలస కార్మికులకు 10 పది లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసు మార్చాలా చేయాలని , ప్రజలందరూ బాగుండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకోవడం జరిగింది అని వారు శరవాణి ద్వారా తెలిపారు.
ఈ పూజా కార్యక్రమలలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి- TGWWC అధ్యక్షులు కల్లెడ భూమయ్య, కడెం మండల ఇంచార్జ్ ధర్మాజీ సత్తన్న బార్ దుబాయ్ కోఆర్డినేటర్ కునారపు రమేష్, కుక్కల రాంరెడ్డి సంగేపు గంగారం, నంబయ్య, శ్రీనివాస్,కల్లేడ నరేష్, సత్యం, సాయి, పందిరి చంద్రయ్య, బిల్లవేణి గణేష్, పందిరి మహేష్, మేడి రామన్న, లింగన్న, గుమ్ముల సాయి తదితరులు పాల్గొన్నారు