
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చెర్ల మండలం కుర్నపల్లి గ్రామ ఉప సర్పంచు ను మావోయిస్టులు నరికి చంపారు.. నలుగురు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఉప సర్పంచ్ ఇర్ప రామారావు ఇంటికి వచ్చి అతని తీసుకెళ్లారు. రామారావు మంగళవారం తెల్లవారుజామున రక్తపుమడుగులో గ్రామశివారులో శవమై కనిపించాడు. అక్కడే చెర్ల – శబరి ఏరియా కమిటీ పేరిట లేఖను పెట్టారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని, అందుకే శిక్షించామని లేఖలో రాసారు..