Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 August 2022, 10:15 am Posted by : anjudega

ప్రముఖ వ్యాపారవేత్త హఠాన్మరణం

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ ఝున్వాలా (62) కన్నుమూశారు. ముంబయిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 6.45 నిమిషాలను కుటుంబసభ్యులు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు.

రాకేశ్ ను ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫేట్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు. ఝున్ ఝున్వాలా మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు