
విరివిగా మొక్కలు నాటి రక్షించాలి
జిల్లా పౌర సంబంధాల అధికారి(డిపిఆర్ఓ): వై సంపత్ కుమార్
మంచిర్యాల జిల్లా: స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినందున స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా పౌర సంబంధాల అధికారి(డిపిఆర్ఓ) వై. సంపత్ కుమార్..
ఈ సందర్భంగా డిపిఆర్ఓ గారు మాట్లాడుతూ.. ఆజాద్ కి అమృత్ ఉత్సవాలలో ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలి మొక్కలే మానవ మనుగడకు జీవనాధారం అని.. జాతిపిత మహాత్మా గాంధీ సూచించినట్లు పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరు హరిత భరితంగా పచ్చల హారంగా మార్చేందుకు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.