
రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణం లోని మార్కెట్ ఏరియాలో వర్తక, వ్యాపార షాపుల యజమానులకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, అలాగే లోడింగ్, అన్లోడింగ్ టైమింగ్ అలాగే రోడ్ ఫై వెళ్లే ప్రజలకు, వాహనాలకు ఎట్టి పరిస్థితి లో ఇబ్బంది లేకుండా వ్యాపారులు సహకరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ సూచించారు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాత్రి 09 తరువాత లోడింగ్ ఆన్ లోడింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 09 గంటల వరకు లోడింగ్, అన్ లోడింగ్ చేయకూడదని ఎవరైనా సమయం పాటించకపోయినా అతిక్రమించిన షాపు యజమాని పై, లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న వాహనాలపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఏసీపీ వెంట మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సిబ్బంది ఉన్నారు..