Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 July 2022, 4:23 pm Posted by : anjudega

బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత.?

వైభవంగా ఉజ్జయిని మహాకాళి బోనాలు.. సికింద్రాబాద్ లో ఆధ్యాత్మిక శోభ

బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలలు ఆలయం వద్దకు తరలివస్తున్నారు. మహిళల కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఉదయం తొలి బోనం సమర్పించారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీగా అక్కడికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..