Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 July 2022, 10:32 am Posted by : anjudega

ప్రజలంత సుఖసంతోషాలతో ఉండాలి: ఎంపీ వెంకటేష్ నేత

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ సమీపంలోని ఆదివారం ఎసిసి క్వారీలో జరుగుతున్నటువంటి దుర్గాదేవి జాతరను స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత దర్శించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… జిల్లా ప్రజలంత సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని , ఆ తల్లి చల్లని దీవేనలతో కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని కొన్ని గ్రామాలు పట్టణంలోని కాలనీలు నీటమునిగాయనీ, నష్టపోయిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుపున సహాయం అందేళా చూస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..