Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 July 2022, 3:15 pm Posted by : anjudega

భారీ ముప్పు తప్పింది: మంత్రి

కడెం: పైనుంచి వరద ప్రవాహం తగ్గడంతో కడెం ప్రాజెక్టుకు భారీ ముప్పు తప్పిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. లెఫ్ట్ కెనాల్ నుంచి నీరు కిందికి వెళ్లిపోతోందని ఆయన చెప్పారు. కొద్దిసేపట్లో ఇంజినీరింగ్ అధికారులు డ్యామ్ మెయింటనెన్స్ పనులు యథావిధిగా చేపడతారన్నారు. వర్షాలు పెరిగి వరద మరింత ఎక్కువైతే ఎవరూ ఏమీ చేయలేరని, వరద రావొద్దని కోరుకుంటూ దేవుడిని ప్రార్ధిద్దామని మంత్రి అన్నారు.