
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఆదివారం నాటి బీజేపీ సభలో ప్రధాని మోడీ చేసిన విమర్శలకు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ నేతల మాటల్లో విషం తప్పా విషయం లేదని అన్నారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి బీజేపీ నేతలకు కనపడడం లేదన్నారు. తాము నీళ్లు ఇవ్వకుంటే అత్యధిక ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొన్నారని ప్రశ్నించారు..