
మంచిర్యాల జిల్లా: మంచిర్యాలకు జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని కోరుతూ శనివారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవిని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ఉపాధ్యక్షులు రజనీష్ జైన్ కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రిని వారు కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే నవోదయ విద్యాలయం మంజూరు చేస్తామని తెలిపారు..