Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 June 2022, 11:20 pm Posted by : Anjaneyulu Dega

కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గు చేటు: విజయశాంతి

తెలంగాణ: లో వైద్య రంగాన్ని అభివృద్ధి చేశామని సీఎం కేసీఆర్, ఆయన భజనపరులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐపీఎస్ సర్వే ప్రకారం దేశంలో 49.9 శాతం మంది ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్తుండగా, తెలంగాణలో కేవలం 36.2 శాతం మాత్రమేనన్నారు. పేదలకు వైద్యం అందించలేని కేసీఆర్ సర్కార్ కు ప్రజల బుద్ధి చెబుతారన్నారు..