
మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ సర్పంచ్ శిరీషపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామంలోని వీధి దీపాలు, చేతిపంపుల కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు, కొన్ని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వార్డు సభ్యులు ఆరోపించడంతో గత ఫిబ్రవరి మాసంలో డీఎల్పీవో రికార్డులను తనిఖీ చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో వాస్తవమని తేలడంతో సర్పంచ్ ను సస్పెండ్ చేసినట్లు ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు..