
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్ లో ఉన్న సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో బుధవారం రాయల్ మంచిర్యాల హార్స్ రైడింగ్ క్లబ్ ను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్రంపై స్వారీ చేసి అందరిని ఉత్సాహ పరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత సమాజానికి ఉపయోగ పడే రంగంలో రాణించి మంచిపేరు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.