Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 May 2022, 5:02 pm Posted by : anjudega

దారుణం.. కన్న తండ్రిని నరికి చంపిన కొడుకులు..?

సూర్యాపేట జిల్లా: భూమిని పంచివ్వలేదన్న కారణంతో కన్న తండ్రిని ఇద్దరు కొడుకులు అతి దారుణంగా నరికి చంపిన సంఘటన గురువారం ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామనికి చెందిన ఎరగాని శ్రీను గౌడ్ (50)కి కొంత వ్యవసాయ భూమి ఉంది. గత కొంత కాలంగా శ్రీను ఇద్దరు కొడుకులు సంతు రాజశేఖర్లు ఆ భూమిని పంచి ఇవ్వాలని తండ్రితో గొడవలు పడుతున్నట్లు సమాచారం.

ఎన్ని సార్లు అడిగిన భూమి పంచి ఇవ్వకపోవడంతో గురువారం ఉదయం తండ్రి శ్రీనుపై గొడ్డలి, కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు..