
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో శుక్రవారం జిల్లా స్థాయి యోగ పోటీలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ పోటీల్లో 6, 7, 8 తరగతుల విభాగంలో ఒ. శ్రీనిత, టి. లక్ష్మీ శరణ్య, కె. శ్రుతి ఉప్పు వైష్ణవి, యు. వైష్ణవి, కె. అభిలాష్, ఎ. అభిలాష్, పి. బాలాజి, 9, 10 తరగతుల విభాగంలో ఎస్. మల్లీశ్వరి, డి. శ్రీహర్షిణి, పి. మధురిమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి యోగ ఒలంపియాడ్ కు ఎంపికయ్యారు..