Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 May 2022, 11:14 am Posted by : anjudega

రోడ్డు పై కూలిన చెట్లను తొలగించిన: ఎస్ఐ సతీష్

మంచిర్యాల జిల్లా: జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడ గ్రామం నుండి ఇందనపల్లి బ్రిడ్జి వెళ్లే రహదారిపై అకాల వర్షం, బలమైన ఈదురుగాలి  కారణంగా రోడ్డుపై చెట్లు కూలీపోవడం జరిగింది. రోడ్డుపై పడిపోవడం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉంది అనే సమాచారం తెలుసుకున్న జన్నారం ఎస్ఐ సతీష్ వెంటనే జెసిబి లు తెప్పించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది గా ఉన్నటువంటి చెట్టు ను రోడ్డు పై నుండి తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రూట్ క్లియర్ చేయడం జరిగింది. ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగ కూడదనే అనే మంచి ఉద్దేశంతో  సమాచారం అందిన వెంటనే స్పందించిన జన్నారం ఎస్ఐ సతీష్, మరియు సిబ్బందిని ప్రజలు వాహనదారులు అభినందించారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు..