Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 March 2022, 10:45 pm Posted by : Anjaneyulu Dega

మనస్తాపం చెంది వివాహిత ఆత్మహత్య..!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కు చెందిన ఆడెపు ధనలక్ష్మి అనే వివాహిత గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనిధి కోపరేటివ్ ఫెడరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే మృతురాలు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివాహ విందుకు వెళ్లే విషయంలో జరిగిన ఆలస్యంతో భర్త రమేష్ తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..