Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 March 2022, 9:23 pm Posted by : Anjaneyulu Dega

ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు: హోం మంత్రి.

హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో పెండింగ్ చాలాన్లు చెల్లించేందుకు ఎక్కువ మంది వాహనాదారులు ఈ-చలాన్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. సర్వర్ సమస్య తలెత్తడంతో చలాన్లు కట్టేందుకు ఎక్కవ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల పెండింగ్ చలాన్ల ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల పెండింగ్ చలాన్ల చెల్లింపులు జరిగాయని వివరించారు. చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.250కోట్ల ఆదాయం వచ్చిందని హోం మంత్రి వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున వారి విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15 వరకు పెండింగ్ చలాన్లపై రాయితీ అవకాశాన్ని పొడిగించినట్టు చెప్పారు. ఇప్పటివరకు చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని హోం మంత్రి సూచించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం రాయితీని ఇచ్చిన విషయం తెలిసిందే.