Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 March 2022, 4:54 pm Posted by : Anjaneyulu Dega

కుక్కను బంధించి కొన్ని రోజులుగా అత్యాచారం!

మధ్యప్రదేశ్: ఇటీవల కాలంలో కామాంధుల అఘాయిత్యాలకు బలవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎక్కడ చూసినా దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల చిన్నారులు, వృద్ధులపై కూడా కామాంధులు తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. అంతేకాకుండా ఆవు, పెంపుడు కుక్కలపై కూడా జుగుప్సాకరంగా అత్యాచారం చేసిన వార్తలు తరచూ వింటున్నాం. ఇదే కోవలో ఓ వ్యక్తి కొన్ని రోజులుగా ఇంట్లో కుక్కను బంధించి, అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని పిప్లానీ ప్రాంతంలో మనోహర్ లాల్ వాద్వానీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల స్థానికంగా ఓ ఆలయం వద్ద కుక్క పిల్లలను ప్రసవించింది. వాటిని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నట్లు అందరికీ చెప్పాడు. తరచూ కుక్క అరుపులు రావడం గమనించి స్థానికులు అసలు విషయమేంటోనని ఆరా తీశారు. అతడి ఇంట్లోకి తొంగి చూడగా కుక్కపై అత్యాచారం చేస్తున్న జుగుప్సాకర ఘటన చూసి షాక్ తిన్నారు. స్థానికుల నుంచి జంతు ప్రేమికుల సంస్థల ప్రతినిధులు అక్కడకు చేరుకుని, కుక్కపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. వారు కేసు పెట్టడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గంజాయి మత్తులో నిందితుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని, భార్యను కూడా వేధించి గెంటేశాడని విచారణలో తేలింది. ప్రస్తుతం అతడిపై 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు..