Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 March 2022, 4:28 am Posted by : Anjaneyulu Dega

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం..

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం  కేశంపేట మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో  శనివారం స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలను బోధించారు.జిల్లా కలెక్టర్ గా నందిని , సి.ఇ.ఒ గా బి శేఖర్ గా,  జిల్లా విద్యాధికారి కె అనితా, మండల విద్యాధికారి గా పి భరత్ , ప్రధానోపాధ్యాయులు గా హేచ్ విష్ణు, కరస్పాండెంట్ గా భాను ప్రియ, ముప్పై మంది ఉపాధ్యాయులు అయ్యారు.అనంతరం  స్వయం పరిపాలన దినోత్సవంలో ఆకట్టుకున్న విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలం తిరుపతి బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తాత్కాలిక ఉపాధ్యాయులు విద్యార్ధులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నా